Wednesday, April 24, 2024

పాఠ్యపుస్తకాల్లో కూడా మత ప్రచారానికి పూనుకున్నారా?: సోము వీర్రాజు

వైసీపీ పాలనలో మతమార్పిడులు జరుగుతున్నాయంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా సీఎం జగన్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. పాఠ్యపుస్తకాల్లో క్రైస్తవ మతం గురించి ఉన్న పాఠాన్ని ట్విట్టర్‌లో ఆయన షేర్ చేస్తూ మండిపడ్డారు.

చిన్నారుల మెదళ్లలో కూడా మీ మతాన్ని చొప్పించడానికి… వారి పాఠ్యపుస్తకాలలో సైతం మత ప్రచారానికి పూనుకున్నారా జగన్ గారూ? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మత వ్యాప్తికి హద్దులు లేవా? అని ప్రశ్నించారు. ఇలాంటి మత ప్రచారాలను వెంటనే చిన్నారుల పాఠ్యపుస్తకాల నుంచి తొలగించండి. లేదంటే బీజేపీ నుంచి పత్రిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement