Saturday, April 20, 2024

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఎన్నికల్లో భారత సంతతి విద్యార్థిని విజయం

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ విద్యార్థి సంఘానికి జరిగిన ఉప ఎన్నికలో భారత సంతతి విద్యార్థిని అన్వీ భుటానీ ఘన విజయం సాధించారు. 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో 11 మంది అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. ఈ స్థాయిలో పోటీ పడటం గతంలో ఎప్పుడూ జరగలేదు. అయినప్పటికీ అన్వీ భుటానీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అన్వీ ప్రస్తుతం యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న మ్యాగ్ డాలెన్ కాలేజీలో హ్యూమన్ సైన్సెస్ లో పీజీ చదువుతున్నారు. ఒక భారతీయ విద్యార్థిని ఈ పదవిని దక్కించుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

కాగా గత ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో భారత విద్యార్థిని రష్మీ సమంత్ గెలుపొందారు. అయితే, సోషల్ మీడియాలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో, విద్యార్థి సంఘం నాయకురాలిగా ఆమె తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలు జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement