Saturday, April 20, 2024

మ్యారేజ్ యాన‌వ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్ లో అన‌సూయ‌-వైర‌ల్ గా ఫొటోస్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోస్ కి ఓ ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం అనసూయ తన భర్తతో కలసి రొమాంటిక్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సముద్ర తీరాన తన భర్తని అనసూయ ముద్దుల్లో ముంచెత్తుతోంది. ఘాటు కౌగిలింతలల్లో ఇద్దరూ మునిగితేలుతున్నారు. అనసూయ ఇంతటి సంతోషానికి కారణం ఉంది. అనసూయ, భరద్వాజ్ దంపతులు తమ 12వ మ్యారేజ్ యానవర్సరీ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. దీనితో వీరిద్దరూ రొమాంటిక్ గా గడుపుతున్నారు.
అనసూయ మేకప్ లేకుండా సముద్ర తీరాన ఉన్న అందమైన లొకేషన్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మతిపోగోట్టే థైస్ అందాలతో అనసూయ కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 21 ఏళ్లుగా కలసి ఉంటున్నాం, 12 ఏళ్ల వివాహ జీవితం.. నీతో గడిపిన ఇన్నేళ్ళలో నీ ప్రేమలో అనేక కోణాలు చూశాను. ఆస్వాదిస్తున్నాను. హ్యాపీ మ్యారేజ్ యానవర్సరీ అంటూ అనసూయ కామెంట్ పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement