Friday, March 29, 2024

లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులకు మరొకరు బలి

లోన్ యాప్ నిర్వాహ‌కులు రెచ్చిపోతున్నారు. లోన్ ఇచ్చి వినియోగ‌దారుల‌ను వేధింపుల‌కు గురిచేస్తున్నారు. వీరి వేధింపుల‌కు ఎంతోమంది బ‌లైన విష‌యం తెలిసిందే. తాజాగా బెజ‌వాడ‌లో యాప్ నిర్వాహ‌కుల వేధింపులు భ‌రించ‌లేక ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఇబ్రహీంపట్నం మండలం, సూరాయపాలెంలో తంగెళ్ళముడి రాజేష్ అనే వ్యక్తి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. యాప్ నిర్వాహకులు రాజేష్ ఫొటోను నగ్నంగా ఉన్న మహిళ ఫొటో పక్కన మార్ఫింగ్ చేసి.. ఆ ఫొటోను రాజేష్ భార్యకు పంపి బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన రాజేష్‌.. తనను లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారని భార్యకు ఫోన్లో చెప్పి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రాజేష్ భార్య ఇంటికి వచ్చేలోగా ఫ్యాన్‌కి వేలాడుతూ భర్త కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement