Friday, March 29, 2024

ఆరు హత్యల కేసులో మరో ట్విస్ట్

విశాఖ నగరంలో అతిదారుణంగా పసిపిల్లలతో సహా ఆరుగురిని చంపిన ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.పెందుర్తి లో జరిగిన ఈ ఆరు హత్యల కేసులో తానే నిందుతున్నని అప్పలరాజు ఒప్పుకున్నాడు. అయితే తాజాగా అప్పలరాజుతో పాటు మరో ఆరుగురుకి ఈ హత్యతో సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు విజయ్. వారిని కూడా అదుపులోకి తీసుకుంటేనే పోస్టుమార్టంకు ఒప్పుకుంటామని బంధువులతో కలిసి విజయ్ ఆందోళనకు దిగాడు.

బత్తిన అప్పలరాజులతో పాటు దుర్గాప్రసాద్, గౌరీష్, శ్రీనులను కూడా శిక్షించాలంటూ విజయ్ డిమాండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం మార్చురీ వద్ద విజయ్, కుటుంబీకులు ఆందోళన చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement