Thursday, April 18, 2024

అమెరికాలో మ‌రోసారి కాల్పుల కలకలం… ఆరుగురి మృతి..

ప్రపంచ పెద్దన్న పాత్రపోశిస్తున్న అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేపింది. గత ఏడాదిలో అమెరికాలో ఎక్కడో ఒక చోట కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం సైతం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ దుంగడులు భయపడడం లేదు. తాజాగా అమెరికాలో మళ్లీ తుపాకీ పేలింది. తాజాగా అమెరికాలో తుపాకీ మోత ప్రకంపనలు సృష్టించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని విసాలియా​ సిటీలో గుర్తుతెలియ‌ని దుండ‌గులు ఒకే కుటుంబానికి చెందిన‌ ఆరుగురిని కాల్చి చంపారు. మృతుల్లో ఓ మహిళతోపాటు ఆమె ఆరు నెలల చిన్నారి ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. విసాలియా సిటీలో కాల్పుల శబ్ధం వినిపించడంతో చుట్టుపక్కల ఉండేవారు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే అక్కడికి వెళ్లిన తులారే కౌంటీ పోలీసులు ఆ ఇంట్లో ఐదు మృతదేహాలను గుర్తించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ‌గా.. ఆస్పత్రికి తీసుకెళ్లిన కాసేపటికి మరణించాడని చెప్పారు. కాగా, ఇది పూర్తిగా ఒక ఫ్యామిలీని టార్గెట్‌గా చేసుకుని కక్ష్యపూరితంగా జరిగిన కాల్పులేనని తులారే కౌంటీ పోలస్ అధికారులు అనుమానిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామన్నారు. ఇక మృతుల్లో ఓ తల్లితో పాటు 6 నెలల చిన్నారి ఉండడం అందరి హృదయాన్ని కలిచివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement