Tuesday, April 23, 2024

కామన్వెల్త్​ గేమ్స్​లో మరో పతకం ఖాయం.. పారా టేబెల్​ టెన్నిస్​లో ఫైనల్​కి ఇండియా

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కి మరో పతకం ఖాయమైంది. ఈ రోజు (శుక్రవారం) పారా టేబుల్ టెన్నిస్‌లో పోటీపడిన భవీనా ఇంగ్లాండ్‌‌కి చెందిన సు బెయిలీని ఓడించి ఫైనల్‌కి చేరింది. 11-6, 11-6, 11-6 తేడాతో గెలిచిన భ‌వీనా సెమీస్ నుంచి పైన‌ల్స్ కి దూసుకెల్లింది. దీంతో భారత్‌ ఖాతాలో మరో మెడల్ చేరడం కూడా ఖాయమైంది. బర్మింగ్‌హామ్ వేదికగా 8 రోజుల నుంచి జరుగుతున్న ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు.

ఇప్పటికే వెయిట్‌లిప్టింగ్, బాక్సింగ్, లాన్ బౌల్స్ తదితర ఈవెంట్లలో భారత్‌కి పతకాలు దక్కాయి. ఈ క్రమంలో ఇప్పటికే 20 మెడల్స్‌ని ఖాతాలో వేసుకున్న భారత్.. పతకాల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఆరు బంగారు పతకాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement