Wednesday, April 24, 2024

వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి.. ఖ‌మ్మం జిల్లాలో ఘ‌ట‌న‌

ఖమ్మం జిల్లాలో మ‌రో ఘోరం జ‌రిగింది. ఖ‌మ్మం మండల పరిధిలోని పుటానితండాలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు బానోతు శరత్ చ‌నిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నిన్న (ఆదివారం) సాయంత్రం పిల్లలతో ఆడుకుంటుండగా వీధి కుక్కులు బాలుడిపై దాడి చేశాయి. దీంతో తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

బాలుడి హెల్త్ కండిష‌న్ బాగా లేక‌పోవ‌డంతో డాక్ట‌ర్లు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని సూచించారు. వెంటనే బాలుడిని హైదరాబాద్‌కు తరలించే క్రమంలో సూర్యాపేట సమీపంలోనే ప్రాణాలు విడిచాడు. బాలుడి తల్లిదండ్రల రోదనలు ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాయి. అధికారులు స్పందించి గ్రామంలోని వీధి కుక్కులను నియంత్రించే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement