Saturday, April 20, 2024

మరో 145 కొత్త కరోనా కేసులు, వెయ్యికి చేరువలో యాక్టివ్‌ కేసులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరుసగా అయిదో రోజూ కొత్త కరోనా కేసులు 100 మార్కును దాటాయి. తాజాగా తెలంగాణలో 15, 200 మందికి టెస్టులు చేయగా 145 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. చికిత్స పొందాక కోలుకోవడంతో 75 మంది డిశ్చార్జి అయ్యారు. అయితే కరోనాతో ఎవరూ కన్నుమూయలేదని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డా. జీ. శ్రీనివాసరావు తెలిపారు.

కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 1000కి చేరువయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 977 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌ నగ రంలో రోజువారీ కరోనా కేసులు సెంచరీ ని దాటాయి. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 117 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 8 కేసులు, మేడ్చల్‌లో 3 కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement