Friday, March 29, 2024

అనిల్‌ రావిపూడికి కరోనా.. ఎఫ్‌3 షూటింగ్‌ వాయిదా!

దేశంలో ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు.  ముఖ్యంగా టాలీవుడ్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా దర్శకుడు అనిల్‌ రావిపూడికి కరోనా వైరస్‌ సోకింది. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉ‍న్నారు. అనిల్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా ‘ఎఫ్ 3’ సినిమాను తీస్తున్నాడు. ఈ మూవీ కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ ఇటీవల మైసూరులో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే డైరెక్టర్‌ అనిల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో షూటింగ్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఎఫ్‌-3లో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, మెహరీన్‌, తమన్నా నటిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఎఫ్‌-3 తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.  కాగా ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొన్న సోనూసూద్ కు నిన్న కరొన సోకిన విషయం తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement