Friday, March 29, 2024

భార్య, ఇద్దరు ఆడపిల్లలను బావిలో తోసేసిన భర్త

మధ్యప్రదేశ్‌లోని ఛాతర్ పూర్ గ్రామంలో దారుణం జరిగింది. తన భార్య ముగ్గురు ఆడపిల్లలను కన్నదని ఆమెపై భర్త కోపాన్ని పెంచుకున్నాడు. మగ పిల్లాడ్ని కనట్లేదంటూ ఇటీవల అతడు భార్యతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆదివారం భార్య, ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేశాడు. ఈ ఘటనలో వారి పెద్ద పాప (8 ఏళ్లు) చనిపోగా, అతడి భార్య, ఆరు నెలల పసికందు ప్రాణాలతో బయటపడ్డారు.

పుట్టింటికెళ్లి తన భార్యాపిల్లలను తీసుకొచ్చే క్రమంలో ఛాతర్ పూర్‌లోని బావి వద్ద బైక్‌ను ఆపిన అతడు.. ముగ్గురినీ బావిలోకి తోసేశాడు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు. భార్య ఎలాగోలా బయటపడి గ్రామస్థుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మగపిల్లాడిని కనలేదన్న కోపంతో గత కొంతకాలంగా భార్యను, పిల్లలను చంపేస్తానంటూ అతడు బెదిరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. కాగా మరో అమ్మాయి మాత్రం వీరితో రాకుండా అమ్మమ్మ దగ్గరే ఉండిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement