Wednesday, April 24, 2024

అక్క‌ను మోసం చేశాడ‌న్న కోపం.. కోర్టులోనే ఖ‌తం చేసేందుకు ప్లాన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా కోర్టుకు ఒక వ్యక్తి కత్తి తీసుకు వచ్చాడు. కత్తితో కోర్టు లోపలికి ప్రవేశించాడు. అతడి వద్ద కత్తిని గుర్తించిన కోర్టు భద్రచాసిబ్బంది పోలీసులకు అప్పగించారు. సాయి కిరణ్‌ అనే వ్యక్తి అక్క అక్బర్‌లు ప్రేమించి గత ఏడాది పెళ్ళి చేసుకున్నారు. తర్వాత విడిపోవడంతో కోర్టు కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అక్బర్‌ బుధవారం కోర్టుకు వచ్చాడు. విషయం తెలుసుకున్న సాయి కిరణ్‌ తన సోదరిని వివాహం చేసుకుని వదిలేసిన అక్బర్‌ను హత్య చేసేందుకు కత్తితో కోర్టుకు తన మిత్రుడితో కలిసి వచ్చాడు. కత్తితో పాటు తిరుగుతున్న సాయికిరణ్‌ను కోర్టు భద్రతా సిబ్బంది గుర్తించి పట్టుకుని ఎల్‌బీ నగర్‌ పోలీసులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement