Thursday, April 25, 2024

‘వకీల్ సాబ్’కు ఏపీ ప్రభుత్వం షాక్

రేపు విడుదల కానున్న ‘వ‌కీల్ సాబ్’కు ఏపీ సర్కారు షాక్ ఇచ్చింది. ఈ సినిమాకు రెండు వారాల పాటు టికెట్ ధ‌ర‌లు పెంచుకోవ‌చ్చ‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని హైకోర్టు కొట్టివేసింది. సినిమా డిస్ట్రిబ్యూట‌ర్లకు మొద‌ట కోర్టు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా… స‌డెన్‌గా ఆ నిర్ణ‌యాన్ని ప‌క్క‌న‌పెట్టేసింది. అంతేకాదు ధ‌ర‌లు పెంచ‌కుండా ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది.

వ‌కీల్ సాబ్ కోసం ప్ర‌త్యేక షోలు, ప్రీమియ‌ర్ షోల‌తో పాటు టికెట్ ధ‌ర‌లు ఏపీవ్యాప్తంగా పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఇప్ప‌టికే అమ్మిన టికెట్ల‌పై ఏం చేయాల‌న్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement