Friday, March 29, 2024

ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి… తెలుగులో మోడీ ప్రసంగం..

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనలో ఉన్నారు. భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రధాని మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇలాంటి పుణ్యభూమికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వీర భూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజు అన్నారు.

అజాదీకా అమృత్‌ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు. యావత్‌ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement