Thursday, April 25, 2024

కరోనా నుంచి కోలుకున్న ఏపీ స్పీకర్ దంపతులు

కరోనా పాజిటివ్ బారిన పడిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకుని బుధవారం మధ్యాహ్నం మెడికవర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్రీకాకుళం నుండి ఇంటికి వెళ్తూ తాము కరోనా నుంచి కోలుకోవడానికి అవసరమైన వైద్య సేవలు అందించిన మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యానికి, డాక్టర్లకు, సిబ్బందికి, పేరు పేరునా తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబసభ్యులు వినమ్ర నమస్కారాలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement