Wednesday, April 17, 2024

జాతీయ స్థాయిలో ఏపీ పోలీసులకు అవార్డుల పంట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో 5 అవార్డులు లభించాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. దాంతో ఏపీ పోలీసులకు ఈ రెండేళ్ల కాలంలో లభించిన అవార్డుల సంఖ్య 130కి దాటిందని తెలిపారు. తాజాగా లభించిన ఐదు అవార్డులు టెక్నాలజీ వినియోగం అంశంలో వచ్చాయని వివరించారు.

కృత్రిమ మేధ, పాస్ పోర్ట్ వెరిఫికేషన్, పోలీసు సిబ్బంది డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నిర్వహణ తదితర అంశాల్లో ఏపీ పోలీసు విధానాలు దేశంలోనే అగ్రగామిగా నిలిచాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర పోలీసుల పనితీరు సర్వత్రా ప్రశంసలు అందుకుందని అన్నారు. తాజా పురస్కారాలతో రాష్ట్ర పోలీసులపై మరింత బాధ్యత పెరిగిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాసిన వర్ల రామయ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement