Wednesday, April 24, 2024

30 శాతం టెన్త్ మార్కులు, 70 శాతం ఫస్టియర్ మార్కులు

ఏపీలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలు రద్దయిన నేపథ్యంలో.. టెన్త్ మార్కులు 30%, ఇంటర్ ఫస్టియర్ మార్కులు 70% ప్రాతిపదికగా సెకండియర్ ఫలితాలు ప్రకటించారు. పరీక్షల ఫలితాల కోసం examresults.ap.ac.in, bie.ap.gov.in, results.bie.ap.gov.in, results.apcfss.in వెబ్‌సైట్లను చూడండి.

కాగా ఏపీ వ్యాప్తంగా 5.10 లక్షల మంది ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పూర్తయినప్పటికీ.. కరోనా కారణంతో థియరీ పరీక్షలు షెడ్యూల్‌ (మే 5 నుంచి 23 వరకు) ప్రకారం జరగలేదు. ఆపై సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానంపై సూచనల కోసం ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి ఛాయారతన్‌ నేతృత్వంలో హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు టెన్త్, ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్‌ ప్రాక్టికల్స్‌ మార్కుల ఆధారంగా ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు మార్కులు ఇవ్వడంపై బోర్డు కసరత్తు జరిపి ఫలితాలను విడుదల చేశారు. అటు త్వరలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు తీపికబురు

Advertisement

తాజా వార్తలు

Advertisement