Saturday, April 20, 2024

ఓబీసీలకు శుభవార్త.. ఆదాయ పరిమితి పెంపు

ఓబీసీలకు ఏపీ సర్కారు శుభవార్త అందించింది. ఓబీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓబీసీల ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచుతూ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఓబీసీ రిజర్వేషన్‌ల కోసం ఆదాయ పరిమితి రూ.6 లక్షలుగా ఉండేది. ఇకపై రూ.8 లక్షల ఆదాయ పరిమితికి లోపు ఉన్నవారందరికీ ఓబీసీ రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. రూ.8 లక్షల ఆదాయం మించిన ఓబీసీలను క్రీమీ లేయర్ గా పరిగణిస్తారు. మిగతావారంతా నాన్ క్రిమిలేయర్ కింద రిజర్వేషన్ ఫలం పొందుతారు. విద్య, ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్‌ల ఫలం లభించనుంది. కాగా ఇప్పటి నుంచి ఓబీసీ సర్టిఫికెట్ల జారీలో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లను, బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్‌ను ఆదేశించింది.

ఈ వార్త కూడా చదవండి: నిరుద్యోగులకు ప్రభుత్వం ముష్టివేస్తోందా?: లోకేష్

Advertisement

తాజా వార్తలు

Advertisement