Friday, April 19, 2024

ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్‌ను ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిత్యనాథ్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆ వెంటనే ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపడతారు. ఈ నేపథ్యంలో ఆయనకు కేబినెట్ హోదా లభించనుంది. ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి ఆయన విధులు నిర్వర్తిస్తారని సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) రేవు ముత్యాలరాజు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement