Thursday, April 25, 2024

ఏపీలో పరిషత్ ఎన్నికల కోసం సర్వం సిద్ధం

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు యథావిధిగా జరుపుకోవచ్చని హైకోర్టు తీర్పు వెల్లడించడంతో ఎన్నికల అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ బరిలో 19,002 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 126 జడ్పీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా అయ్యాయి. పరిషత్ ఎన్నికల కోసం 33,663 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,82,15,104 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో 38 జడ్పీటీసీ, 601 ఎంపీటీసీ స్థానాలకు, విజయనగరం జిల్లాలో 31 జడ్పీటీసీ, 494 ఎంపీటీసీ స్థానాలకు, విశాఖ జిల్లాలో 38 జడ్పీటీసీ, 614 ఎంపీటీసీ స్థానాలకు, తూర్పు గోదావరి జిల్లాలో 61 జడ్పీటీసీ, 1004 ఎంపీటీసీ స్థానాలకు, పశ్చిమ గోదావరి జిల్లాలో 46 జడ్పీటీసీ, 790 ఎంపీటీసీ స్థానాలకు, కృష్ణా జిల్లాలో 44 జడ్పీటీసీ, 654 ఎంపీటీసీ స్థానాలకు, గుంటూరు జిల్లాలో 46 జడ్పీటీసీ, 579 ఎంపీటీసీ స్థానాలకు, ప్రకాశం జిల్లాలో 41 జడ్పీటీసీ, 394 ఎంపీటీసీ స్థానాలకు, నెల్లూరు జిల్లాలో 34 జడ్పీటీసీ, 366 ఎంపీటీసీ స్థానాలకు, చిత్తూరు జిల్లాలో 35 జడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలకు, కడప జిల్లాలో 12 జడ్పీటీసీ, 118 ఎంపీటీసీ స్థానాలకు, కర్నూలు జిల్లాలో 37 జడ్పీటీసీ, 492 ఎంపీటీసీ స్థానాలకు, అనంతపురం జిల్లాలో 63 జడ్పీటీసీ, 791 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement