Tuesday, March 26, 2024

హస్తినలో ఆంధ్ర మామిడి.. స్టాల్​ని ప్రారంభించిన ప్రవీణ్ ప్రకాష్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నోరూరించే ఆంధ్ర మామిడి పళ్లు హస్తినవాసులకు అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలో ఏపీ మార్క్ ఫెడ్ ఏర్పాటు చేసిన మామిడి పళ్ల దుకాణాన్ని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా పండ్ల అమ్మకాలు ప్రారంభించారు.

కార్యక్రమంలో అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ తో పాటు భవన్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ మామిడి పళ్ల దుకాణం ఉదయం10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అన్నిరకాల మామిడిపళ్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయని స్టాల్ నిర్వాహకులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement