Friday, April 19, 2024

నా మందులో హానికారక పదార్థం లేదు: ఆనందయ్య

కరోనా వ్యాధి కోసం ఇస్తున్న ఆనందయ్య మందుపై ఒక హానికారక పదార్థం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరపు లాయర్ కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే…. దీనిపై ఆనందయ్య స్పందించాడు.. గత 16 ఏళ్లుగా తాను కంటిమందును వేస్తున్నానని, ఎవరికీ ఇబ్బంది కలగలేదని చెప్పారు. తన మందులో ఎలాంటి విష పదార్థం లేదని తెలిపారు. ఎవరి కంటిచూపు దెబ్బతినలేదని… ఎవరికైనా ఇబ్బంది కలిగిందని చెబితే, మందు ఇవ్వడాన్ని తాను పూర్తిగా ఆపేస్తానని చెప్పారు. తన మందుకు కోర్టు అనుమతించకపోయినా తనకు వచ్చిన నష్టం ఏమీ లేదని… ప్రజలే ఇబ్బంది పడతారని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement