Tuesday, April 23, 2024

Tweet: సింధు పోడియం టాప్‌లో ఉండేది: ఆనంద్ మ‌హీంద్రా

ఒలింపిక్స్ లో రెండో సారి మెడల్ కొట్టిన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఎప్పుడు టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహించే ఆనంద్ మహీంద్ర విజయం పై స్పందించారు. అస‌లు మానసిక బ‌లానికే క‌నుక గోల్డ్ మెడ‌ల్ ఉండి ఉంటే ఆమె పోడియం టాప్‌లో ఉండేది. ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసే ఓట‌మి నుంచి ఒక రోజులోనే కోలుకొని ఇలా గెల‌వ‌డానికి ఎంత ప‌ట్టుద‌ల‌, అంకిత‌భావం కావాలి అని ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేశారు. దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ.. ఆమె మ‌హీంద్రా థార్‌కు అర్హురాలు అని కామెంట్ చేశారు. ఈ కామెంట్‌పై కూడా ఆనంద్ మ‌హీంద్రా స్పందించారు. ఇప్ప‌టికే ఆమె గ్యారేజీలో థార్ కారు ఉందంటూ ఓ ఫొటోను ట్వీట్ చేయ‌డం విశేషం. ఆ ఫొటోలో సింధుతోపాటు అప్ప‌డు మెడ‌ల్ గెలిచిన రెజ్ల‌ర్ సాక్షి మాలిక్ థార్ కారులోనే వెళ్ల‌డం చూడొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement