Tuesday, April 23, 2024

బీడి ఆకు సేకరణలో కట్టకు 95 పైసలు పెంపు.. ఈ సీజన్‌ నుంచే పెరిగిన రేట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీడీ ఆకు సేకరణలో కట్టకు రూ.2.05 పైసల నుంచి రూ.3కు పెంచామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. ఈ సీజన్‌ నుంచే పెరిగిన రేట్లు వర్తింపజేస్తున్నామని ఆయన తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలో తునికాకు సేకరణదారులకు బోనస్‌ చెక్కులను మంత్రి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో ఆదివాసీలకు తునికాకు సేకరణ రెండో పంటగా, ఆర్థికవనరుగా ఉపయోగపడుతుందన్నారు.

తునికాకు సేకరణ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కూలీలకు బోనస్‌ రూపంలో రెవెన్యూ నెట్‌ షేర్‌ను చెల్లిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2016 నుంచి 2021 వరకు రూ.200 కోట్లను బోనస్‌ చెల్లిస్తున్నామని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సిర్పూర్‌ నియోజకవర్గం నుంచి తునికాకు కూలీలకు బోనస్‌ను చెల్లించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పీసీసీఎఫ్‌ ఆర్‌.డోబ్రియల్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement