Friday, March 29, 2024

అమృత ప్రొడక్షన్స్ మ‌రో చిత్రం..

తొలి సినిమాతో తెలుగు సిని మా పరిశ్రమను తనవైపుకు తిప్పుకున్న దర్శక, నిర్మాత సాయి రాజేశ్‌. ఆయన అమృత ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘హృదయ కాలేయం’ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘కొబ్బ రిమట్ట’ హిట్‌ అయింది. మూడో సిని మాగా సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో నిర్మితమైన ‘కలర్‌ ఫోటో’ ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అం దుకుంది. అలా వరుసగా మూడు హిట్స్‌తో హ్యాట్రిక్‌ కొట్టిన అమృతా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ నుంచి నాలుగో సిని మా ప్రకటించారు. ఈ సినిమాకు సుమన్‌ పాతూరి దర్శకుడు. గతంలో ‘ఇంకోసారి’ అనే చిత్రంతో ఉత్తమ నూ తన దర్శకుడుగా నంది అవార్డ్‌ అందు కున్నాడు సుమన్‌ పాతూరి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సిని మాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయబోతున్నారు. చిత్రానికి కథ, మాటలు, నిర్మాత : సాయి రాజేష్‌ నీలమ్‌, నిర్మాత : ఎస్కే ఎన్‌, సహ నిర్మాతలు : రమేష్‌ పెద్దేటి, శేష శైలేంద్ర, సినిమాటోగ్రఫీ : అష్కర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement