Friday, April 19, 2024

ఎంపీ సంతోష్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌’లో పాల్గొన్న బిగ్ బీ అమితాబ్

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బిగ్ బీ అమితాబ్ పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనతో ఎంపీ సంతోష్ ఓ మొక్క నాటించారు. ఈ సందర్భంగా భావితరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ సంతోష్ కుమార్‌ను అమితాబ్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: పడవ బోల్తా 57 మంది మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement