Wednesday, March 27, 2024

నేడు వార‌ణాసి టూర్ కు అమిత్ షా

కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా ఈరోజు వారణాసి వెళ్ల‌నున్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల దృష్ట్యా బీజేపీ ముందు నుంచే ఎన్నిక‌ల‌కు సమాయత్తమవుతోంది. ఈ నేప‌థ్యంలోనే అమిత్ షా అమిత్ షా అక్క‌డికి వెళ్తున్నారు. ఆయన తూర్పు యూపీలోనే రెండు రోజులపాటు పర్యటించనున్నారు. బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో అమిత్ షా పాల్గొనే అవకాశముంది. ఈ సమావేశానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా హాజ‌రు కానున్నారు. అలాగే అజంగఢ్‌లో ఓ యూనివర్సిటీకి అమిత్ షా శంకుస్థాపన చేసి, ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించ‌నున్నారు. బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్లు, బూత్ ప్రెసిడెంట్లతో కూడా మరొక సమావేశం నిర్వహించ‌నున్నారు. తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై అమిత్ షా అభిప్రాయాలను సేకరించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement