Saturday, April 20, 2024

బేగంపేట ఎయిర్‌పోర్టులో మొక్కలు నాటిన బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో బాలీవుడ్ న‌టుడు అమీర్‌ఖాన్ పాల్గొన్నారు. ఈ మేరకు బేగంపేట ఎయిర్‌పోర్టులో టాలీవుడ్ న‌టుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌, ఎంపీ సంతోష్ కుమార్‌తో క‌లిసి అమీర్‌ఖాన్ మొక్క‌లు నాటాడు. ఈ సంద‌ర్భంగా అమీర్‌ఖాన్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

పర్యావరణం పచ్చగా ఉండాలంటే ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటి, వాటిని సంర‌క్షించాల‌ని అమీర్‌ఖాన్ సూచించాడు. అప్పుడే మ‌న భ‌విష్య‌త్ త‌రాల‌కు మంచి జీవితాన్ని ఇచ్చిన‌వాళ్లం అవుతామ‌ని తెలిపాడు. దీన్ని ఒక కార్య‌క్ర‌మంగా కాకుండా, నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాల‌ని అమీర్‌ఖాన్ పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement