అమెరికాపై కరోనా వైరస్ ప్రభావంపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. తమ దేశం ఇప్పటికీ చావు బతుకుల రేసులోనే ఉందని, ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని చెప్పారు.ఇప్పటికీ అమెరికాలో కొత్త కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య అధికమవుతుందని చెప్పారు.
తమ ప్రభుత్వం 75 రోజుల్లో 150 మిలియన్ల డోసుల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసిందని తెలిపారు. మొదట రోజుల్లో 100 మిలియన్ డోసులు వ్యాక్సిన్లు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన.. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని 200 మిలియన్లకు పెంచారు. ఈ ఏడాది జులై 4వ తేదీలోపు కరోనా తీవ్రత తగ్గి మంచి రోజులు వస్తాయని ఆయన తెలిపారు. ఆలోపు ఎంతమందిని కాపాడుకుంటామనేదే ముఖ్యమని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 19 నుంచి అమెరికాలో వయోజనులందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు.