Friday, April 26, 2024

వేములవాడ ఆలయానికి అంబులెన్స్ అందజేత…

వేములవాడ రాజరాజేశ్వరి ఆలయానికి సోమవారం రాజమణి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ గారి రమణ అంబులెన్స్ ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొద్దిరోజుల క్రితం ఆసుపత్రి ప్రాంగణంలో ఓ భక్తుడికి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యం కావడంతో ఆ భక్తుడు మృతి చెందాడ‌ని.. ఈ విషయం తనను ఎంతో బాధ పెట్టిందని తెలిపారు. ఇలాంటి సంఘటన తిరిగి జరగవద్దని తన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయానికి ఉచితంగా అంబులెన్స్ అందించడం జరిగిందని తెలిపారు. తన ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవలో ముందు ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సుధా చరణ్, ప్రదీప్, అప్పారావు, బిఆర్ఎస్ నాయకులు కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement