Thursday, March 28, 2024

సబ్ స్క్రిప్షన్ల ధరలపై యూజర్లకు మరోసారి షాక్ ఇచ్చిన అమెజాన్..

దేశంలోని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఒకటైన అమెజాన్ యూజర్లకు మళ్లీ షాకిచ్చిన.. సబ్ స్క్రిప్షన్ల ధరలు భారీగా పెంచేసింది. మెదట సబ్ స్క్రిప్షన్ తీసుకునే యూజర్ కు వన్ మంత్ ఫ్రీ ట్రైల్ ఆఫర్ ఇస్తుంది అమెజాన్. ఆ తర్వాత ఇష్టమైతే కంటిన్యూ అవ్వొచ్చు లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెలకు, మూడు నెలలకు లేదా ఏడాది వరకూ సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు. మొదట్లో అమెజాన్ ప్రైమ్ వార్షిక ప్లాన్ ధర కేవలం రూ.500. కానీ, ఆ తర్వాత రూ.999 చేసింది. ఆ తర్వాత ఇది కాస్తా రూ.1,499 కు చేరింది. కానీ.. ఇప్పుడు ప్రైమ్ యూజర్లకు అమెజాన్ మరో షాకిచ్చింది. నెలవారీ, మూడు నెలల సబ్ స్క్రిప్షన్ ప్లాన్లను ఏకంగా 67 శాతం మేర పెంచేసింది.

ఇప్పుడు మంత్లీ సబ్ స్క్రిప్షన్ల తీసుకునే వారు రూ.299 పెట్టి రీచార్జ్ చేసుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఇది రూ.179 గా ఉండేది. మూడు నెలలకు ఉన్న రూ.459 కాస్తా రూ.599కు పెంచేసింది. అయితే వార్షిక ప్లాన్లో మాత్రం మార్పు చేయలేదు. అది రూ.1499 గానే ఉంచింది. అయితే వార్షిక సబ్ స్క్రిప్షన్లను పెంచుకునేందుకు అమెజాన్ నెల, మూడు నెలల ధరలను పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న యూజర్లకు 2024 జనవరి 15 వరకూ పాత ప్లాన్లే వర్తిస్తాయి. కొత్త యూజర్లకు, పాత ప్లాన్ రెన్యువల్ చేసుకోని యూజర్లకు మాత్రం కొత్తగా పెంచిన ధరలు వర్తిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement