Saturday, March 23, 2024

రాజధాని పోరాటం.. రైతులదే అంతిమ విజయం!

ఏపీ రాజధానిని తరలించవద్దంటూ అమరావతి రైతులు చేపట్టిన నిరసనలు 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా వారికి విజయం దక్కాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశించారు. రాజధాని రైతులు తమ నిరసనలు తెలుపుతున్నా సీఎం జగన్ పట్టించుకోకపోవడంపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘ప్రజారాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 500 రోజులు. తన పాలనలో తాను తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి సుమారు 29 వేల మంది రైతులు బాధపడుతూ దీక్షలు చేస్తోంటే, 500 రోజులలో ఒక్కసారైనా వారిని కలిసి మాట్లాడని మూర్ఖపు పాలకుడిని చూడటం చరిత్రలో ఇదే మొదటిసారి.”కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ!” అన్నారు. రాష్ట్ర రాజధాని కోసం, తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తోన్న మహిళలను బూటు కాళ్ళతో తన్నించినందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు. పాలకులు ఎంత  నిర్దయగా ప్రవర్తిస్తున్నా, ప్రజా రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు 500 రోజులుగా శాంతియుతంగా నిరాటంకంగా తమ ఆందోళనను కొనసాగిస్తోన్న రైతులు, రైతు కూలీలు, మహిళలకి అంతిమ విజయం దక్కాలని ఆశిస్తున్నాను’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement