Friday, April 19, 2024

అమ‌రావ‌తిపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసేంత‌వ‌ర‌కు పోరాడుతాం..ఎంపీ రామ్మెహ‌న్ నాయుడు..

ఏపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల బిల్లును వెన‌క్కి తీసుకున్న నేప‌థ్యంలో టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు స్పందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌న‌సులో ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానం క‌లుగుతోంద‌ని తెలిపారు. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందన్నారు. దీనిపై సీఎం జగన్ స్వయంగా ప్రకటన చేయాలని తెలిపారు. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు టీడీపీ పోరాడుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement