Tuesday, April 23, 2024

అమలాపాల్ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’ ట్రైలర్

అమలాపాల్, రాహుల్ విజయ్ జంటగా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’ ట్రైలర్ గురువారం విడుదలైంది. ‘యు టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించాడు. అమలాపాల్ ఈ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తుండగా, జూలై 16 నుండి తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ వెబ్ సిరీస్‌లో అమలా పాల్ తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారిగా కనిపించింది. ఆమె జీవితంలో జరిగిందే పదే పదే జరుగుతుంది. ఆమెలాగే మరో వ్యక్తికి కూడా ఇలాగే జరుగుతుంది. ఈ క్రమంలో వీరిద్దరూ టైం లూప్‌లో ఇరుక్కుంటారు. ఓ ప్రమాదంలో చనిపోయిన అమ్మాయికి, వీళ్లిద్దరికీ సంబంధం ఏమిటి ? వాళ్ళు ఆ సమస్యను ఎలా పరిష్కరించారు ? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించినట్లు తాజాగా ట్రైలర్‌తో అర్థమవుతోంది.

YouTube video

ఈ వార్త కూడా చదవండి: చిక్కుల్లో బాలీవుడ్ నటి కరీనాకపూర్

Advertisement

తాజా వార్తలు

Advertisement