Thursday, April 25, 2024

దోస్త్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో 11 వేల డిగ్రీ సీట్ల కేటాయింపు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డిగ్రీ అడ్మిషన్ల కోసం నిర్వహించే దోస్త్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో 11,602 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. ఇందులో సీటు పొందిన అభ్యర్థులు తమ సీట్లను ఈనెల 31 వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసి ఖరారు చేసుకోవాలని అధికారులు తెలిపారు. స్పెషల్‌ డ్రైవ్‌లో మొత్తం 11,964 మంది వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోగా అందులో 11,602 మంది మాత్రం సీటు పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement