Saturday, April 20, 2024

Telangana | ఆల్‌ ఇండియా హైకోర్టు లాయర్లు క్రికెట్‌ టోర్నమెంట్‌.. విజేతగా తెలంగాణ హైకోర్టు టీమ్‌

పాండిచ్చేరిలో జరుగుతున్న ఆల్‌ ఇండియా హైకోర్టు లాయర్ల 25వ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతగా తెలంగాణ హైకోర్టు లాయర్స్‌ జట్టు నిలిచింది. అలహాబాద్‌ హైకోర్టు లాయర్స్‌ టీమ్‌తో జరిగిన ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో తెలంగాణ జట్టు విజయం సాధించింది. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే టాస్‌ గెలిచిన అలహాబాద్‌ హైకోర్టు న్యాయవాదుల జట్టు బౌలింగ్‌ ఎంచుకోగా, తెలంగాణ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో తెలంగాణ జట్టు 165 పరుగులు చేసింది. 166 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన అలహాబాద్‌ హైకోర్టు న్యాయవాదుల జట్టును 130 పరుగులకే కుప్పకూల్చింది.

దీంతో 35 పరుగుల తేడాతో తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల టీమ్‌ విజయం సాధించింది. విజేతగా నిలిచిన తెలంగాణ హైకోర్టు లాయర్ల జట్టుకు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, పలువురు న్యాయవాదులు, భారత జాగృతి లీగల్‌ సెల్‌ కెప్టెన్‌, బార్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ సునీల్‌ గౌడ్‌ను ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement