Saturday, April 20, 2024

ఈనెల 17న అలయ్-బలయ్.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి

తెలంగాణలో అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది దసరా పండుగ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే.. ఈ సారి బండారు దత్తాత్రేయ అందుబాటులో లేక పోవడం కారణంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఆయన కూతురు విజయలక్ష్మీ చేతులతో మీదుగా నిర్వహించనున్నారు.

ఈ 17 వ తేదీన అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తామని.. జల విహార్‌లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అవుతుందని ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారని తెలిపారు. అన్ని పార్టీల నేతలను ఆహ్వానించామని.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు హర్యానా సీఎంను కూడా అలయ్ బలయ్‌కు ఆహ్వానించామని చెప్పారు. 2005లో దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement