Wednesday, April 24, 2024

Karimnagar | రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా ఐపీఎస్ అధికారి అఖిల్ మహాజన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్​, 2017 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అఖిల్ మహాజన్ మంచిర్యాల ఏసీపీగా, రామగుండం కమిషనరేట్ అడ్మిన్ గా పనిచేశారు. ప్రస్తుతం మంచిర్యాల డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న రాహుల్ హెగ్డే స్థానంలో అఖిల్ మహాజన్ ను ప్రభుత్వం నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement