Thursday, April 25, 2024

ఓటీటీలో దుమ్ము లేపుతోన్న ఐరావ‌తం.. వంద మిలియ‌న్ల వ్యూస్

ఓటీటీలో దుమ్ము లేపుతోంది ఐరావ‌తం చిత్రం.ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎస్తేర్ న‌టించింది. ఈ సినిమాకి , బలమైన కథనానికి ఆడియెన్స్ సత్కారం దక్కింది. చిత్రాన్ని నూజివీడు టాకీస్ పై రేఖ పలగాని సమర్పణలో నిర్మాత‌లు రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట నిర్మించారు. గుణశేఖర్ శిష్యుడు సుహాస్ మీరా దర్శకత్వం వహించారు. ఎస్తేర్ నోర్హ, తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి ఆయా పాత్రల్లో నటించారు. ఇండియా లోనే అతిపెద్ద బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రీసెంట్ గా వచ్చి సైలెంట్ గా హిట్ కొట్టింది “ఐరావతం”. ఈ డీసెంట్ ఫ్యూజన్ డ్రామా 2022 నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

Iravatahamకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఊహించని ఆదరణ దక్కించుకుంది. ఒక నెలలో 100 మిలియన్ అండ్ ఫిఫ్టీ తౌసండ్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించింది. ప్రస్తుతం టాప్ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి వ‌స్తోన్న హ్యూజ్ రెస్పాన్స్‌తో టీమ్ అంతా క‌ల‌సి సక్సెస్ పార్టీని సెల‌బ్రేట్ చేసుకుంది. త్వరలోనే ఐరావతం పార్ట్ 2 కూడా తీయబోతున్నారని తెలుస్తుంది. ఇంతకీ సినిమా కథేంటంటే.. శ్లోక అనే బ్యూటీషియన్ కి బర్త్ డే రోజు ఒక వైట్ కెమెరా గిఫ్ట్ గా వస్తుంది. అప్పటి నుంచి ఆమె లైఫ్ తలక్రిందులు అవుతుంది. బర్త్ డే వీడియోలు తీస్తే డెత్ డే వీడియోలు వస్తుంటాయి. అందులో ఇష్యూస్ డీకోడ్ చేసే క్రమంలో ఎన్నో రహస్యాలు బయట పడుతుంటాయి. ఆ రహస్యాల అల్లికే ఐరావతం అనే తెల్ల కెమెరా కథ.

Advertisement

తాజా వార్తలు

Advertisement