Monday, March 25, 2024

ఎయిర్‌ ఇండియా స్పెషల్‌ ఆఫర్‌.. దేశీ టికెట్లపై డిస్కౌంట్‌

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా విమాన టికెట్ల రేట్లపై రాయితీలు ప్రకటించింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఆ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు తెలిపింది. దేశీయ ప్రయాణాలకు లిమిటెడ్‌ సీట్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని ఎయిర్‌ ఇండియా తెలిపింది. ఎంపిక చేసిన 49 రూట్లలో ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకున్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది. జనవరి 21 నుంచి జనవరి 23 మద్య టికెట్లు బుక్‌ చేసుకునే వారికి ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుందని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య ప్రయాణించ వచ్చని పేర్కొంది.

ఎయిర్‌ ఇండియా సిటీ ఆఫీస్‌, ఎయిర్‌పోర్ట్‌ ఆఫీస్‌, వెబ్‌సైట్స్‌, మొబైల్‌ యాప్స్‌, ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. టికెట్‌ ధరలు 1705 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఎంపిక చేసిన రూట్లలో డిస్కౌంట్‌ ధరలులు ఎయిర్‌ ఇండియా తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. న్యూఢిల్లి నుంచి ముంబై, చెన్నయ్‌ నుంచి న్యూఢిల్లి, బెంగళూర్‌ నుంచి ముంబై, ఢిల్లి నుంచి ఉదయ్‌ పూర్‌, ఢిల్లి నుంచి గోవా, ఢిల్లి నుంచి పోర్టుబ్లేయర్‌, ఢిల్లి నుంచి శ్రీనగర్‌, అహ్మదాబాద్‌ నుంచి ముంబై, గోవా నుంచి ముంబై, దింపూర్‌ నుంచి గౌహతీ రూట్లలో రాయితీపై టికెట్లు పొందవచ్చని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement