Friday, April 19, 2024

సర్వే: అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి దారుణ ఓటమి

తమిళనాడులో కొన్నిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పార్టీల గెలుపోటములపై జాతీయ మీడియాలు సర్వేలు చేపడుతున్నాయి. అయితే గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌పై కన్నేసిన అధికార పార్టీ అన్నాడీఎంకేకు ఈ సారి దారుణ ఓటమి తప్పదని సర్వేలు బహిర్గతం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకే తక్కువ స్థానాలకే పరిమితం అవుతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి.

తమిళనాడులో మొత్తం 234 సీట్లకు గానూ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీకి 177 సీట్లు వస్తాయని ఓ జాతీయ మీడియా తన సర్వేలో వెల్లడించింది. ఇక అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి కేవలం 49 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే పేర్కొంది. మిగతా 8 సీట్లను ఇతర పార్టీలు పంచుకుంటాయని తెలిపింది. దీంతో కమల్ పార్టీ కూడా నామమాత్రంగానే మిగులుతుందని సర్వేల ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement