Wednesday, April 24, 2024

అగ్నిపథ్ విధానం యువతకు వ్యతిరేకం కాదు : కిషన్ రెడ్డి

అగ్నిపథ్ విధానం యువతకు వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… అగ్నిపథ్ లో చేరడం యువతకు అదనపు అర్హత అన్నారు. ఇతర ఉద్యోగాల్లో చేరడానికి నైపుణ్యం పెరుగుతుందన్నారు. కొందరు కావాలని విధ్వంసం చేయాలని చూస్తున్నారన్నారు. అగ్నిపథ్ పై కుట్రపూరితంగా ప్రచారం జరుగుతోందన్నారు. స్వచ్ఛందంగా ఇష్టపడే వాళ్లు మాత్రమే చేరవచ్చన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement