Saturday, April 20, 2024

ఎన్నికలు జరిగిన 4 నెలల తర్వాత.. ఏలూరులో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

హైకోర్టు ఆదేశాలతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో కౌంటింగ్ చేస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్‌కు మార్చి 10న ఎన్నికలు జరిగాయి. మొత్తం 50 డివిజన్లు ఉండగా 3 ఏకగ్రీవమయ్యాయి. 47 డివిజన్లకు పోలింగ్ నిర్వహించారు. ఈ మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వివాదాల కారణంగా గతంలో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది

కాగా కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. లెక్కింపులో కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. కౌంటింగ్ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. మొత్తం 50 డివిజన్లకు గాను వైసీపీ 47 స్థానాల్లో పోటీ చేయగా, టీడీపీ 43, జనసేన 20 చోట్ల పోటీ చేసింది. ఇతర అభ్యర్థులతో కలిసి మొత్తం 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 30న మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది.

ఈ వార్త కూడా చదవండి: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Advertisement

తాజా వార్తలు

Advertisement