Thursday, April 25, 2024

ఆఫ్ఘాన్‌లో ముష్కరుల బాంబు దాడి..30 మంది దుర్మరణం

ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోమారు చెలరేగిపోయారు. రాజధాని కాబూల్‌లోని ఓ పాఠశాల వద్ద బాంబు పేళ్లుళ్లకు పాలుపడ్డారు. శక్తిమంతమైన బాంబు పేలుడులో 30 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో అత్యధికులు విద్యార్థులేనని, అది కూడా 11-15 ఏళ్ల మధ్య వయసున్న వారేనని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ కాబూల్‌లోని దష్ట్-ఎ-బార్చి జిల్లాలోని సయ్యద్ అల్ షాదా పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది. అయితే ఈ దారుణంపై తాలిబన్లు స్పందించారు. ఈ పేలుడుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. కాగా, బాంబు పేలుడుకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement