Thursday, April 25, 2024

ఆఫ్గన్ నుంచి పారిపోయిన పాప్ స్టార్ ఆర్యన..

ఆప్టనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించడంతో అక్కడి పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ఆ దేశ ప్రజల మానప్రాణాలకు రక్షణ కరవైన వేళ దేశం నుంచి వెళ్లిపోయేందుకు ప్రముఖులు సైతం ప్రయత్నిస్తున్నారు. బతికి ఉంటే బలుసాకు తినొచ్చన్న ఉద్దేశంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తాలిబన్ల కంట పడకుండా దేశం దాటుతున్నారు. తాజాగా ఆ దేశ పాప్ స్టార్ ఆర్యన ఆఫ్గాన్ నుంచి పారిపోయింది. పాప్‌స్టార్‌గా వెలుగొందుతున్న ఆర్యన సయీద్ కూడా దేశం నుంచి తప్పించుకుంది. కాబూల్‌ను విడిచి పారిపోయిన ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది.

అమెరికా కార్గో జెట్ విమానంలో దేశాన్ని విడిచిన ఆర్యన.. విమానంలో ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. రెండు భయంకరమైన రాత్రుల అనంతరం తాను క్షేమంగా, సజీవంగా ఉన్నానని అందులో రాసుకొచ్చింది. దోహా చేరుకున్నానని, ఇస్తాంబుల్ వెళ్లే విమానం కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొంది. ఇంటికి చేరుకుని షాక్ నుంచి తేరుకున్నాక మీతో పంచుకునేందుకు చాలా విషయాలున్నాయని ఆ పోస్టులో రాసుకొచ్చింది. కాగా, సినీ నిర్మాత అయిన హసీబ్ సయ్యద్‌ను ఆర్యన వివాహం చేసుకుంది.

ఇది కూడా చదవండి: ఐపీఎల్ కొత్త యాడ్.. ధోని రాకింగ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement