Thursday, April 25, 2024

కొమురం భీం, కొమరయ్యల సాహసాలు మరువలేనివి.. కేసీఆర్

కొమురం భీం, దొడ్డి కొమరయ్యల సాహసాలు మరువలేనివని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండా వందనం చేశారు. ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. కొమురం భీం ను స్మరణ చేసుకుందామన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తలుచుకుందామన్నారు. ఆనాడు ఉజ్వల ఉద్యమం నడిచిందన్నారు. తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజా స్వామ్యం వైపు నడిచిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement