Tuesday, April 23, 2024

నేవీ కొత్త‌ చీఫ్ గా అడ్మిరల్‌ హరికుమార్ బాధ్యతల స్వీకరణ..

భారత నౌకదళ అధిపతిగా అడ్మిరల్‌ ఆర్‌. హరికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్‌కు ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్ ఇన్‌ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈరోజే ప్రస్తుత భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేశారు. దీంతో వైస్‌ అడ్మిరల్ గా ఉన్న‌ హరికుమార్ ఆయ‌న నుంచి బాధ్యతలు స్వీక‌రించారు.

1962 ఏప్రిల్‌ 12న జన్మించిన ఆర్‌.హరికుమార్‌ 1983లో భారత నౌకదళంలో చేరారు. 39 ఏళ్లలో ఆయన కమాండ్‌, స్టాఫ్‌ విభాగాల్లో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఐఎన్‌ఎస్‌ నిషాంక్‌, మిస్సైల్‌ కార్వెట్‌, ఐఎన్‌ఎస్‌ కొరా, గైడెడ్‌ మిస్సైల్‌ డిస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ రణ్‌విర్‌కు కమాండింగ్‌ అధికారిగా పనిచేశారు. నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఐఎన్‌ఎస్‌ విరాట్‌కు నాయకత్వం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement