Friday, March 29, 2024

తిరుగుబాటు ఎమ్మెల్యేల‌కు ఆదిత్య‌థాక్రే స‌వాల్ – మేం త‌ప్పు చేస్తే పార్టీని వీడొచ్చు

తిరుగుబాటు ఎమ్మెల్యేల‌కు ద‌మ్ముంటే పార్టీకి రాజీనామా చేసి ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని సీఎం ఉద్ధ‌వ్ ఠ్రాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే స‌వాల్ విసిరారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ముంబైలో పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ఆదిత్య థాక్రే మాట్లాడారు. .ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు.మీకు ఏ మాత్రం దమ్ము, ధైర్యమున్నా శివసేన పార్టీని వదిలేయండి. మా తప్పేంటో చెప్పి పోరాటం చేయండి. మేం ఏదైనా తప్పు చేశామా.. ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలో ఏమైనా లోపముందా.. మేమంతా ఏదైనా తప్పు చేస్తున్నామా… అలా అయితే పార్టీకి రాజీనామా చేయండి. ఎన్నికల్లో పోరాడండి. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం అని తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఆదిత్య సవాల్ విసిరారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన నమ్మక ద్రోహాన్ని తాము ఎప్పటికీ మర్చిపోబోమని స్పష్టం చేశారు. మ‌రి ఆయ‌న స‌వాల్ ని ఎమ్మెల్యేలు ఏ విధంగా స్వీక‌రిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement