Thursday, April 25, 2024

అయోధ్య‌లో ఆదిపురుష్ టీజ‌ర్-ట్వీట్ చేసిన ద‌ర్శ‌కుడు

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న తాజా చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రం నుండి అప్ డేట్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు ఓం రౌత్. మీ మ్యూజికల్ ప్రయాణం ఇప్పుడు మీ అనుభవం.. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆది పురుష్ సినిమా టీజర్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ అక్టోబర్ 2వ తేదీన ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో బ్యాంక్ ఆఫ్ సరయు వేదికగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఆయ‌న చేసిన‌ ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది. ఈ అప్ డేట్ తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. హీరో ప్రభాస్ ప్ర‌ధాన పాత్రలో నటిస్తున్నారు. కీలకమైన పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్, హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తున్నది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని దాదాపుగా రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement