Tuesday, April 23, 2024

ఆదిపురుష్ కి ఢిల్లీ కోర్టులో ఊర‌ట‌

స్టార్ హీరో ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆదిపురుష్’​ సినిమాకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఆ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్​ను అడ్వకేట్ రాజ్ గౌరవ్ ఉపసంహరించుకున్నారు. ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్​ అయింది. నేను అభ్యంతరం వ్యక్తం చేసిన వాటిపై చిత్ర యూనిట్​ స్పందించింది. సినిమాలో అవసరమైన మార్పులు చేస్తున్నట్లు నాకు తెలిసింది.

అందుకే ఇంజక్షన్ పిటిషన్​ను వెనక్కు తీసుకుంటున్నాను’ అని పిటిషనర్​ కోర్టుకు తెలిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే జడ్జి ఈ పిటిషన్​ను కొట్టివేశారు. ఆదిపురుష్​’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ గతేడాది దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాముడు, హనుమంతుడిని తోలు పట్టీలు ధరించి అసమంజసమైన ధోరణిలో చూపించారని పిటిషనర్లు ఆరోపించారు. రావణుడ్ని కూడా తప్పుగా చూపించారని అందులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement